AP : వైసీపీది విధ్వంస పాలన : ఎమ్మెల్యే గురజాల

X
By - Manikanta |11 Oct 2024 1:15 PM IST
వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గత ఐదేళ్ల తాగునీటి వ్యవస్థను వైసీపీ నాశనం చేసిందనీ.. చివరి భూములకు నీళ్లు అందించాల్సి గత ప్రభుత్వం నిధులు డ్రా చేసుకుని పనులు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. గురజాల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి, ఆకురాజుపల్లి, రామాపురం పంట మేజర్ కాల్వల మరమ్మత్తులు, ఆధునీకరణ పనులకు ఎంపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిలతో కలిసి ఎమ్మెల్యే ఎరపతినేని శంకుస్థాపన చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com