Yuva Galam : అశేష జనవాహిని మధ్య లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. అశేష జనవాహిని మధ్య పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ యువగళం పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్న లోకేష్.. ప్రజలకు భరోసా కల్పిస్తోన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగుతున్నారు. 11వ రోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.
చిత్తూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ముస్లిం పెద్దలతో నారా లోకేష్ పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు ఎంఎస్ఆర్ సర్కిల్లో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు చిత్తూరు కోర్టు సర్కిల్లో లాయర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కూడా లోకేష్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇవాళ విడిది కేంద్రం మంగసముద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు లోకేష్ విత్ సెల్ఫీ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున యువత, మహిళలు, చిన్నారులు లోకేశ్తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. పాదయాత్ర ప్రారంభించిన కాసేపటికే చిత్తూరు సంతపేటలోని బీడీ కాలనీకి లోకేష్ పాదయాత్ర చేరుకుంది. అక్కడ బీడీ వర్కర్లతో సమావేశమైన లోకేష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com