Yuvagalam : లోకేష్ పాదయాత్రలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గాజులమండ్యంలో జెండాలు, ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల అడ్డంకి చర్యలకు రెవెన్యూ సిబ్బంది తోడవ్వడంపై మండిపడ్డారు.
అంతకుముందు లోకేష్ పాదయాత్రకు నీలిసానిపేట ఎస్టీ కాలనీ వాసులు అపూర్వస్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర 25వ రోజు రేణిగుంట మండలం జీపాలెం నుంచి ప్రారంభమయింది. యాత్రకు ముందు మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడికి నివాళలర్పించారు లోకేష్. ఎర్రన్నాయుడు 66వ జయంతి సందర్భంగా.. జీపాలెం విడిది కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేశారు.
పాదయాత్రలో భాగంగా స్థానికుల కష్టాలు తెలుసుకుంటూ వారిలో భరోసా కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. కాసేపట్లో రేణిగుంట వై కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపీ వైద్యులతో ముఖాముఖిలో పాల్గొంటారు. విరామం తర్వాత యాదవ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. అనంతరం రేణిగుంట బస్టాండ్ సమీపం లో దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి తిరుపతి అంకుర హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com