Yuvagalam : టీడీపీతోనే యాదవులకు రాజ్యాధికారం : లోకేష్

Yuvagalam : టీడీపీతోనే యాదవులకు రాజ్యాధికారం : లోకేష్
తొలుత లోక్‌ సభకు యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు

తిరుపతి జిల్లాలో యువగళం జోష్ కొనసాగుతుంది. లోకేష్ వెంట వేలాది మంది యువత కదులుతున్నారు. ఇక పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువనేత ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాలతో లోకేష్‌ మమేకం అవుతున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్‌ ఎండగడుతున్నారు. లోకేష్‌ ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇక అధికారంలోకి రాబోయేది టీడీపీనేనని.. ఎవరు అధైర్య పడొద్దని.. అందరికి అండగా ఉంటానని లోకేష్‌ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

రేణిగుంటలో యాదవ సామాజిక వర్గంతో లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయాలను యాదవ సామాజిక వర్గం నేతలు లోకేష్‌కు వివరించారు. టీడీపీతోనే యాదవులకు రాజ్యాధికారం లభించిందని లోకేష్‌ అన్నారు. తొలుత లోక్‌ సభకు యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో యాదవులకు ప్రాధాన్యత లేదన్నారు. బడుగులకు సేవ చేయలేని మూర్ఖపు మనస్సు జగన్‌దన్న లోకేష్.. బాధలు పోవాలంటే బాబు రావాలన్నారు.

Tags

Next Story