Yuvagalam: కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర

Yuvagalam: కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర


యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగు పెట్టనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లిలోని..చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా కృష్ణా జిల్లాలో ప్రవేశించనుంది.ఉండవల్లి లోని సీతానగరం వద్ద.. 2500 కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుంది లోకేష్‌ యువగళం పాదయాత్ర.విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.యువనేత పాదయాత్ర కోసం జిల్లా నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తమ నాయకుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు.

ఇక యువగళం ఏర్పాట్లను పర్యవేక్షించారు టీడీపీ నేతల కేశినేని చిన్ని.విజయవాడలో నారా లోకేష్‌ యువగళం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు కేశినేని చిన్ని.యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. లోకేష్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. అయితే వైసీపీ సర్కార్‌ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.లోకేష్ యువగళంతో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న ఆయనరేపటి భవిష్యత్ కు లోకేష్ మాత్రమే భరోసా అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story