FLIGHTS: 10 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమానాలు

భారతీయ ఎయిర్లైన్స్ ఇండిగో తన అంతర్జాతీయ కార్యకలాపాల్లో విస్తరణకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లండన్, ఏథెన్స్ సహా 10 విదేశీ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు.
ఈ కొత్త గమ్యస్థానాల్లో...
లండన్, ఏథెన్స్, ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్),, మాంచెస్టర్ (బ్రిటన్), కోపన్హాగన్ (డెన్మార్క్), సీమ్ రీప్ (కంబోడియా), మరియు మధ్య ఆసియాలోని నాలుగు నగరాలు ఉంటాయని ఎల్బర్స్ తెలిపారు. ఇందులో భాగంగా, జూలైలో ముంబయి నుంచి మాంచెస్టర్, ఆమ్స్టర్డామ్లకు బోయింగ్ 787-9 డ్రీంలైనర్ విమానాలతో నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాల్లో విదేశీ విమానయాన సంస్థలు 55% వాటాను ఆక్రమించగా, దేశీయ సంస్థలు 45% వాటాతో ఉన్నాయని ఎల్బర్స్ పేర్కొన్నారు. ఈ విస్తరణతో ఇండిగో వాటా మరింత పెరిగే అవకాశముంది. విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఇండిగో, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న బీఐఏఎల్తో ఎమ్ఆర్ఓ కేంద్ర ఏర్పాటుకు ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండిగో వెట్ లీజ్ పద్ధతిలో నిర్వహిస్తున్న తుర్కిష్ ఎయిర్లైన్స్ విమానాల సేవలను 2025 ఆగస్టు 31 వరకు కొనసాగించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడంలో కీలకం కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com