Good News : కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మినిమమ్ బ్యాలెన్స్ టెన్షన్ ఇక పై లేదు.

Good News : కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మినిమమ్ బ్యాలెన్స్ టెన్షన్ ఇక పై లేదు.
X

Good News : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు పొదుపు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచనందుకు విధించే పెనాల్టీని పూర్తిగా రద్దు చేసింది. బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. సేవింగ్ అకౌంట్ హోల్డర్లు ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా ఎటువంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. గతంలో కొన్ని ప్రత్యేక పథకాలకు ఈ మినహాయింపు ఉండగా, ఇప్పుడు దాన్ని అన్ని పొదుపు ఖాతా పథకాలకు వర్తింపజేశారు.

ఈ నిర్ణయంపై బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ సంతోషం వ్యక్తం చేశారు. బ్యాంక్ తమ ఖాతాదారులకు మరింత ఉపశమనం కలిగించాలని భావిస్తోందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల దృష్టి సారించే ఆలోచన, ఆర్థిక చేరిక సాధ్యమవుతుందని, తద్వారా కస్టమర్లకు లాభం చేకూరుతుందని, బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికీ సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త నియమం సెప్టెంబర్ 30, 2025 తర్వాతే అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు పాత నిబంధనలే కొనసాగుతాయి.

మినిమమ్ బ్యాలెన్స్ పై జరిమానాను తొలగించడం వల్ల ముఖ్యంగా చిన్న ఖాతాదారులు, పెన్షనర్లకు గణనీయమైన లబ్ధి చేకూరుతుంది. తరచుగా, చిన్న మొత్తంలో పొదుపు చేసేవారు లేదా అవగాహన లోపం ఉన్నవారు కనిష్ట బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేక జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ చర్య ద్వారా చిన్న మొత్తంలో పొదుపు చేసే అలాంటి ఖాతాదారులందరికీ ఊరట లభిస్తుంది. బ్యాంక్ సీఈఓ ప్రకారం, ప్రతి కస్టమర్‌కు సులభమైన బ్యాంకింగ్ సదుపాయాన్ని అందించడమే తమ లక్ష్యం అని, బ్యాంకింగ్ రంగంలో ఇది ఒక మంచి మార్పు అని పేర్కొన్నారు.

మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఒక ఖాతాదారుడు తన పొదుపు ఖాతాలో ఒక నెలలో తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాల్సిన కనీస బ్యాలెన్స్. ఈ మొత్తాన్ని నిర్వహించడంలో విఫలమైతే, బ్యాంక్ జరిమానా విధిస్తుంది. ఈ MAB మొత్తం ఖాతా రకం, బ్యాంకు ఉన్న ప్రాంతాన్ని (నగరం/పట్టణం/గ్రామం) బట్టి వేరువేరుగా ఉంటుంది.

Tags

Next Story