Google : గూగుల్ నుంచి కొత్త బడ్స్, వాచ్.. అమేజింగ్ ఫీచర్స్

'మేజ్ బై గూగుల్ ఈవెంట్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్లతో పాటు బడ్స్, వాచ్ లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బిడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్ ను ఇచ్చారు. అడ్వాన్స్ డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం ఈ చిప్ను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది.
ఇవి సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించారు.
పిక్సెల్ వాచ్ 3లో రెండు మోడల్స్ ఉన్నాయి. 41 ఎంఎం. 45 ఎంఎం సైజ్లు అందుబాటులో ఉన్నాయి. 11 ఎంఎం సైజ్ ధర రూ.39,900గా.. 45 ఎంఎం సైజ్ ధర రూ.43,900గా కంపెనీ నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాచ్ ను 100 శాతం రిసైకిల్ అయిన అల్యూమినియంతో రూపొందించారు.
వీటిని గూగుల్ ఏఐ యాక్సెస్ చేయవచ్చు. ఈ వాచ్ తో గుండె పని తీరును ట్రాక్ చేయవచ్చు. ఈ వాచ్ లో 24 గంటల రన్ టైమ్ బ్యాటరీని ఇచ్చారు. ఆగస్టు 22 నుంచి అమ్మకాలు ఆరంభం కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com