INDIA: భారత శాస్త్ర సాంకేతికరంగంలో అద్భుత మైలురాయి

INDIA: భారత శాస్త్ర సాంకేతికరంగంలో అద్భుత మైలురాయి
X
చైనా తరహాలో వెయ్యి కి.మీ. నెట్‌వర్క్‌ సాకారం.. హ్యాకింగ్‌ లేని కమ్యూనికేషన్‌ దిశగా ముందడుగు.. శాస్త్ర సాంకేతికరంగం అద్భుత మైలురాయి

ప్ర­పం­చం రా­జ­కీయ పరి­ణా­మా­లు, యు­ద్ధ ఉద్రి­క్త­త­లు, ఎన్ని­కల చర్చ­ల­తో ము­ని­గి­పో­యిన వేళ… భారత శా­స్త్ర సాం­కే­తిక రంగం మా­త్రం ని­శ్శ­బ్దం­గా ఒక భారీ మై­లు­రా­యి­ని అం­దు­కుం­ది. సై­బ­ర్‌ భద్రత, కమ్యూ­ని­కే­ష­న్‌ రం­గా­ల్లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­ల­కు దారి తీసే క్వాం­ట­మ్‌ కమ్యూ­ని­కే­ష­న్‌ నె­ట్‌­వ­ర్క్‌­లో దేశం కీలక పు­రో­గ­తి సా­ధిం­చిం­ది. స్వ­దే­శీ పరి­జ్ఞా­నం­తో దా­దా­పు వె­య్యి కి­లో­మీ­ట­ర్ల మేర వి­స్త­రిం­చే క్వాం­ట­మ్‌ కమ్యూ­ని­కే­ష­న్‌ సా­మ­ర్థ్యా­న్ని భారత శా­స్త్ర­వే­త్త­లు వి­జ­య­వం­తం­గా ని­రూ­పిం­చ­డం, భవి­ష్య­త్‌ డి­జి­ట­ల్‌ భద్ర­త­కు బల­మైన పు­నా­ది వే­స్తోం­ది. ఇప్ప­టి­వ­ర­కు హ్యా­కిం­గ్‌, డేటా లీ­కు­లు, సై­బ­ర్‌ దా­డు­లు వంటి సమ­స్య­లు ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా పె­రు­గు­తు­న్న నే­ప­థ్యం­లో, ఈ కొ­త్త వ్య­వ­స్థ భద్ర­మైన కమ్యూ­ని­కే­ష­న్‌­కు మా­ర్గం సు­గ­మం చే­స్తుం­ద­ని ని­పు­ణు­లు భా­వి­స్తు­న్నా­రు. ము­ఖ్యం­గా బ్యాం­కిం­గ్‌, యూ­పీఐ లా­వా­దే­వీ­లు, వి­ద్యు­త్‌ గ్రి­డ్‌­లు, రై­ల్వే నె­ట్‌­వ­ర్క్‌­లు వంటి కీలక మౌ­లిక వస­తు­ల­పై జరి­గే సై­బ­ర్‌ దా­డు­ల­ను అరి­క­ట్ట­డం­లో ఇది కీలక పా­త్ర పో­షిం­చే అవ­కా­శ­ముం­ది.

క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ అంటే సాధారణంగా వినిపించే ఇంటర్నెట్‌ లేదా మొబైల్‌ కమ్యూనికేషన్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన సాంకేతిక విధానం. ఇందులో సమాచార మార్పిడి ఫోటాన్ల ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్వాంటం ఎంటగల్మెంట్, క్వాంటం సూపర్ పొజిషన్ వంటి క్వాంటమ్‌ మెకానిక్స్‌ సూత్రాలను వినియోగిస్తారు. సమాచారాన్ని భద్రంగా పంపిణీ చేయడానికి క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో డేటా ఎన్‌క్రిప్షన్‌ కీలు మార్పిడి జరుగుతుంది, అవి మధ్యలో ఎవరైనా హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తించవచ్చు. అయితే క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో ఒక పెద్ద సవాలు దూరం. ఫోటాన్ల రూపంలో ప్రయాణించే సంకేతాలు ఎక్కువ దూరం వెళ్లే కొద్దీ బలహీనపడతాయి. సాధారణ కమ్యూనికేషన్‌లాగా రిపీటర్లతో వాటిని బలోపేతం చేయడం సాధ్యం కాదు.

ఎందుకంటే అలా చేస్తే క్వాంటమ్‌ లక్షణాలు కోల్పోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారత శాస్త్రవేత్తలు నెట్‌వర్క్‌ను చిన్న భాగాలుగా విభజించి, వాటిని ‘ట్రస్టెడ్‌ నోడ్స్‌’ ద్వారా అనుసంధానించే పద్ధతిని ఉపయోగించారు. ప్రతి సెగ్మెంట్‌లో క్యూకేడీ ద్వారా భద్రంగా కీలు మార్పిడి చేసి, ఆ చిన్న భాగాలన్నింటిని కలిపి పెద్ద నెట్‌వర్క్‌గా నిర్మించారు. ఈ విధానంతో వెయ్యి కిలోమీటర్ల పొడవైన నెట్‌వర్క్‌ను నిర్మించవచ్చని భారతదేశం నిరూపించింది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో QNu Labs వంటి స్వదేశీ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ రంగంలో చైనా ముందంజలో ఉన్నప్పటికీ, భారత్‌ ఇప్పుడు ఆ స్థాయికి చేరువవుతున్నట్లు ఈ పురోగతి సూచిస్తోంది క్వాం­ట­మ్‌ కమ్యూ­ని­కే­ష­న్‌ ప్ర­యో­జ­నా­లు వి­స్తృ­తం­గా ఉన్నా­యి. జా­తీయ భద్ర­త­కు సం­బం­ధిం­చిన కమ్యూ­ని­కే­ష­న్లు పూ­ర్తి­గా సు­ర­క్షి­తం­గా ఉం­డే­లా చే­య­వ­చ్చు. బ్యాం­కిం­గ్‌, డి­జి­ట­ల్‌ చె­ల్లిం­పుల వ్య­వ­స్థ­లు హ్యా­కిం­గ్‌­కు గు­ర­య్యే ప్ర­మా­దం తగ్గు­తుం­ది. ఆరో­గ్య­రం­గం­లో సు­న్ని­త­మైన వై­ద్య సమా­చా­రా­న్ని ఆసు­ప­త్రుల మధ్య భద్రం­గా పం­పిం­చ­వ­చ్చు. అం­తే­కా­కుం­డా నీటి అడు­గున, భూ­గ­ర్భం­లో, పట్టణ ప్రాం­తా­ల్లో కూడా ఈ వ్య­వ­స్థ­ను అమలు చే­య­వ­చ్చు. ప్ర­స్తు­తం ఉప­యో­గం­లో ఉన్న ఇం­ట­ర్నె­ట్‌ వ్య­వ­స్థ­లు ఆర్‌­ఎ­స్‌ఏ వంటి పబ్లి­క్‌-కీ ఎన్‌­క్రి­ప్ష­న్‌ వి­ధా­నా­ల­పై ఆధా­ర­ప­డి ఉం­టా­యి. ఇవి భద్ర­మ­ని భా­విం­చి­నా, భవి­ష్య­త్తు­లో కం­ప్యూ­టిం­గ్‌ శక్తి పె­రి­గి­తే వా­టి­ని ఛే­దిం­చే అవ­కా­శ­ముం­ది.

Tags

Next Story