STOCKS: జోష్‌‌లో చరిత్ర సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు

STOCKS: జోష్‌‌లో చరిత్ర సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు
X
భారీ లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దేశీయ మార్కెట్లలో అద్భుత ఫలితాలను కనబరిచాయి. అంతర్జాతీయంగా కూడా అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగియడం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చల్లో పురోగతితో కలసొచ్చిన శుభ సంకేతాల నేపథ్యంలో భారత మార్కెట్లు భారీ ఊతం పొందాయి. దీంతో, సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీలకు కొత్త శిఖరాలు అందుకున్న చారిత్రక రోజు గమనంగా నిలిచింది.

ఇంట్రాడేలోనే చరిత్ర

సెన్సెక్స్‌ 3,000 పాయింట్లకు పైగా ఎగబాకి 82,495 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,975 పాయింట్ల లాభంతో 82,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 916 పాయింట్లు లాభపడి 24,924 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.16 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని స్థాయిలో ₹432 లక్షల కోట్లకు చేరింది.

ఊపందుకున్న రంగాలు..

అన్ని రంగాలూ లాభాల్లో ముగిశాయి.

ఐటీ రంగం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ రూపంలో 6.70% లాభంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది.

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 4 శాతం మేర పెరిగాయి.

టెక్నాలజీ షేర్లు ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, టెక్‌మహీంద్రా, టాటా స్టీల్‌ మొదలైనవి ప్రముఖంగా రాణించాయి.

రియల్టీ, మెటల్‌, ఆటో రంగాలు కూడా మార్కెట్‌ ర్యాలీకి తోడయ్యాయి.

భారత్‌-పాక్‌ ఒప్పందం

శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు సిగ్నల్స్‌ వచ్చాయి. ఇది మదుపర్లలో విశ్వాసం నింపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి విరామం ప్రకటించడం కూడా కలిసి వచ్చింది.

అమెరికా-చైనా చర్చలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదాలపై చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఇరు దేశాలు తమ తమ దిగుమతి టారిఫ్‌లను 115% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇవి 90 రోజులపాటు అమలులో ఉంటాయి.

రష్యా-ఉక్రెయిన్‌ పురోగతి

యుద్ధ ముసుగులో ఉన్న రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చలకు కొత్త ఊపొచ్చింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరతకు దోహదపడింది.

విదేశీ పెట్టుబడుల హస్తం

విదేశీ సంస్థాగత మదుపుదారులు వరుసగా కొనుగోళ్లు కొనసాగించడమూ ఈ ర్యాలీకి బలాన్ని చేకూర్చింది.

బంగారం–క్రూడ్ ధరలు స్థిరంగా

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సుకు 3,222 డాలర్ల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ సైతం స్థిరంగా కొనసాగుతోంది

Tags

Next Story