Swiggy : ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ

X
By - Manikanta |25 Oct 2024 6:30 PM IST
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం ప్లాట్ఫామ్ ధరలు పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్పైనా రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ ఫీజుగా రూ.7 వసూలు చేసేది. జొమాటో తన ప్లాట్ఫామ్ ధరల్ని పెంచిన తర్వాత స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్లాట్ఫామ్ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్ చూస్తే స్పష్టమవుతోంది. యాప్ ఓపెన్ చేయగానే ఆర్డర్పై ప్లాట్ఫామ్ ఫీజు హైదరాబాద్లో రూ.10గా చూపిస్తోంది. ఇక జొమాటో కూడా తన ప్లాట్ఫామ్ ఫీజును రూ.10కి పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే తొలుత ఇవన్నీ రూమర్లే అని వార్తలు వ్యాపించడంతో కంపెనీ ఈ విషయంపై తాజాగా స్పందించింది. ఫ్లాట్ఫామ్ ఫీజు పెంపు వాస్తవమే అని వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com