Prabhas : ప్రభాస్ పిఆర్వోపై జర్నలిస్ట్ పోలీస్ ఫిర్యాదు

సెలబ్రిటీస్ పై ఏ వార్త అయినా కాస్త కన్ఫార్మ్ చేసుకుని రాయడమో, చూపించడమో చేయాలి. ఏదో ఎక్కడో విన్న వార్తనో, గాసిప్ నో నిజం అనుకుని ప్రసారం చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ నే ఫేస్ చేస్తున్నాడు జర్నలిస్ట్ విజయ్ సాధు. అతను ఓ యూ ట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్నాడు. పొలిటికల్ ఇంటర్వ్యూస్ తో ఎక్కువగా కనిపించే ఈ జర్నలిస్ట్ రీసెంట్ గా ప్రభాస్ కు ఓ పెద్ద సర్జరీ అయింది అనే వార్తను వీడియోగా చేశాడు. అయితే అందులో నిజం లేదు అని సదరు ఛానల్ కు విషయం చెబితే అయిపోయేది. కానీ ప్రభాస్ పిఆర్వోగా ఉన్న సురేష్ కొండి అనే అతను ఈ వార్తకు ఏమైనా ఆధారాలేంటీ అని ప్రశ్నిస్తూ.. సదరు జర్నలిస్ట్ ను నోటికి వచ్చిన బూతులు తిట్టాడట. డిలీట్ చేయాలని బెదిరింపులకూ దిగాడట. అంతేకాక రెండు రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అని చెబుతూ కొందరు వ్యక్తులు ఆ ఛానల్ వద్ద న్యూసెన్స్ చేయాలని ప్రయత్నించారట. దీంతో ఛానల్ వాళ్లు డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీస్ లు వచ్చి సర్ది చెప్పి అందరినీ పంపించారు. అయితే ఈ మొత్తం గొడవ పిఆర్వో వల్లే జరిగింది అని అతనిపై చర్యలు తీసుకోవాలని విజయ్ సాధు పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు.
నిజానికి ఇలాంటి అంశాలను మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ జర్నలిస్ట్ లు తెలియక పోస్ట్ పెట్టినా నిజం చెప్పి తీసేయించవచ్చు. బెదిరింపుల వరకూ వెళ్లేంత అంశం అయితే కాదిది. అలాగే ఒక వార్తను నలుగురికి చెబుతున్నప్పుడు సదరు జర్నలిస్ట్ కూడా ఓ సారి క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సింది. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com