Meenakshi Chowdhury : మీనాక్షి చౌదరికి మరో క్రేజీ ఆఫర్!

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మీనాక్షి చౌదరి.. రెండో సినిమా తోనే మాస్ మహరాజ్ రవితేజతో 'ఖి లాడీ'లో చాన్స్ కొట్టేసింది. గతేడాది ‘లక్కీ భాస్కర్’తో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. వరుణ్ తేజ్ చేసిన 'మట్కా' బోల్తా కొట్టేసినా.. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మీనాక్షి కెరీర్లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టితో 'అనగనగా ఓ రాజు' చేస్తోన్న మీనాక్షి.. ఇటీవలే నాగచైత న్య 24వ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో తనేంటో నిరూపించుకున్న ఈభామ.. లేటెస్టుగా కోలీవుడ్ ను కూడా టార్గెట్ చేసింది. ‘కోలై' మూవీతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి గతేడాది 'గోట్', 'సింగపూర్ సెలూన్' చి త్రాల్లోనూ నటించింది. అయితే తాజాగా ఊహించని ఆఫర్ ఆమెను వరించింది. కోలీవుడ్ అగ్రహీరో చియాన్ విక్రమ్ సరసన ఆమె నటించనుంది. మావీరన్, మండేలా చిత్రాలను డైరెక్ట్ చేసిన మడొన్నే అశ్విన్.. విక్రమ్ తో ఓ సినిమా చేయను న్నాడు. ఇందులో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అందం, అభినయం ఉన్న మీనాక్షికి కోలీవుడ్లో హిట్ దక్కుతుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com