Nithya Menen : మేమేమన్నా ఆట బొమ్మలమా? : నిత్యామీనన్

Nithya Menen : మేమేమన్నా ఆట బొమ్మలమా? : నిత్యామీనన్
X

'అలా మొదలైంది’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించింది ఈ చిన్నది. టాలెంట్ ఉంటే చాలు హీరోయిన్గా రాణించవచ్చని నిరూపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఇక ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న జాతీయ అవార్డును 'తిరు'(తిరు చిట్రంబళం)చిత్రానికి గాను అందుకుని సత్తా చాటింది. తాజాగా నిత్య మరోసారి ధనుష్ సరసన నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంట గా తలైవన్ తలైవి చిత్రంలో నటిస్తోంది. కాగా.. కొద్ది రోజుల క్రితం నిత్యా మీనన్ ఓ ఈవెంట్ కి వెళ్లింది. అక్కడ ఓ అభిమాని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఈముద్దుగుమ్మ అతనికి నమస్కారం చేసి తనకు జలుబు ఉందని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నటుడిని కౌగిలించుకుని చేయి ఇచ్చింది. ఈ వీడియోని షేర్ చేస్తూ నిత్యామీనన్ ను నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఈనేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇందులో ఈ బ్యూటీ నటీమణుల కష్టాల గురించి ప్రస్తావించింది. 'చాలా మంది పురుషులు నటీమణులను ఈజీగా టచ్ చేయవచ్చని అనుకుంటారు. మేము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. కరచాలనం అంటూ ఎగబడతారు. అదే సాధారణ మహిళలను షేక్ హ్యాండ్ అడు గుతున్నారా ? అలా ఈజీగా టచ్ చేయడానికి మేమేమన్నా ఆట బొమ్మలమా? అంటూ నిత్యామీనన్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story