RGV : మాస్ ను మర్చిన బాలీవుడ్ .. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నిర్మాతాలు డిఫరెంట్ గా ఆలోచించడం లేదంటున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ, పుష్ప 2 వంటి సినిమాలు తీసేందుకు ముందుకు రావడం లేదన్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాది, ఉత్తరాది.. ప్రేక్షకులు ఎక్క డైనా ఒక్కటేనని, సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయని అన్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవారని గుర్తు చేశారు. సౌత్లో ఉన్న ఆనాటి అగ్ర హీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించినవారేనని చెప్పారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారన్నారు. కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిశాయన్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గింది. 'మైనే ప్యార్ కియా', 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' వంటి సినిమాలు పుట్టుకొచ్చాయని అన్నారు. ఇటీవల కొత్తతరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ.. విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. అదేతరహా చిత్రాలను రూపొందిస్తున్నారని వివరించారు. ఆ విధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మర్చి పోయిందని చెప్పారు. మాస్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడం మానేసిందని చెప్పారు. సౌత్ పరిశ్రమలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇక్కడి వారు తమ సంస్కృతి, సం ప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com