OG : పవన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఓజీకి టికెట్ ధరల పెంపుకు అనుమతి

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.
విడుదల తేదీ, టికెట్ ధరల వివరాలు సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. ఈ షోకు టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. రెగ్యులర్ షోలు సినిమా విడుదల రోజు అయిన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఒక్కో టికెట్పై రూ.100 పెంచుకోవచ్చు. ఒక్కో టికెట్పై రూ.150 పెంచుకోవచ్చు.
ఈ నిర్ణయంతో చిత్ర యూనిట్తో పాటు, పవన్ కల్యాణ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com