Sai Dharam Tej: సాయి థరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్..

Sai Dharam Tej: సాయి థరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్..
ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదలన చేశారు.

ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్‌లో జరిగిన మోటార్ బైక్ ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలపాలైన అతడిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదలన చేశారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రధాన అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.

సోదరుడు వైష్ణవ్ తేజ్, మామ పవన్ కళ్యాణ్, కజిన్స్ వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల, స్నేహితుడు సందీప్ కిషన్‌తో సహా ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ అల్లు అరవింద్, చిరంజీవి భార్య సురేఖ కూడా ఉన్నారు.

ప్రమాదంలో సాయి తేజ్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, అతను క్రమంగా కోలుకుంటున్నందున అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను స్పోర్ట్స్ బైక్ వెళుతున్నప్పుడు బండి స్కిడ్ అయి మాదాపూర్ ప్రాంతంలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో పడిపోయింది. నటుడు హెల్మెట్ ధరించిన కారణంగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

వెంటనే స్పందించిన స్థానికులు, 108 సాయంతో సమీపంలోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరి అయిన విజయ దుర్గ కుమారుడు సాయి ధరమ్ తేజ్.

కాగా, నటుడు ప్రకాష్ రాజ్ అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్యులతో మాట్లాడాం.. సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడొక ఫైటర్,, త్వరగా కోలుకుంటారు అని ప్రకాష్ రాజ్ ఆకాంక్షించారు. మరోవైపు సాయితేజ్‌ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందామని నటుడు శ్రీకాంత్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story