Ajith : హీరో అజిత్ మరోసారి సాయం..
By - TV5 Digital Team |15 May 2021 2:01 PM GMT
తమిళనాడు సీఎం సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్ (FEFSI)కు రూ.10 లక్షలు విరాళం అందించారు.
కరోనాపై పోరులో భాగంగా హీరో అజిత్.. మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తమిళనాడు సీఎం సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్ (FEFSI)కు రూ.10 లక్షలు విరాళం అందించారు. కరోనా కట్టడికి గాను గతేడాది కూడా అజిత్ విరాళాలు అందజేశాడు. గత ఏడాది పిఎం-కేర్స్ సహాయనిధికి రూ .50 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్కు రూ .50 లక్షలు, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎస్ఐ) కు రూ .25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. కాగా అజిత్ ప్రస్తుతం 'వాలిమై' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు. హెచ్.వినోద్ డైరెక్టర్. ఈ ఏడాది చివర్లో మూవీ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com