Tollywood : హిలేరియస్గా ఉంది.. బద్మాషులు టీజర్ రిలీజ్

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్లో బద్మాషులు అనే సినిమా రాబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు మేకర్స్. తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాను ఇష్టపడుతున్నారు. అదే గ్రామీణ నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించాడు. బీ బాలకృష్ణ, సీ రామ శంకర్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో హాస్య భరితంగా ఉండబోతుంది . ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుంటూ ఆ అనుభూతిని నలుగురు పంచుకునే చిత్రం ఇది. కథ పరంగా నవ్విస్తూనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతి ఒక క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అని చెప్పాలి. ప్రొఫెషనల్ కమెడియన్ మించి హాస్యం పండించారు. నిజంగా వారిని చూస్తుంటే కథలో మనం కూడా ఉన్న ఫీల్ వస్తుంది. టీజర్ ఇంతగా నవ్వించిందంటే ఫుల్ మూవీ ఎలా ఉంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా హాజరైన హీరో రాగ్ మయూర్ (Rag Mayur) మాట్లాడుతూ.. ‘చీఫ్ గెస్ట్గా కాదు ఒక మంచి ఫ్రెండ్గా వచ్చాను. మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. తనది వండర్ ఫుల్ జర్నీ. విద్యసాగర్ మంచి నటుడు. రూటెడ్ డ్రామాలకి మంచి డిమాండ్ ఉంది. ఆడియన్స్ చాలా రిలేట్ చేసుకుంటున్నారు. సినిమా బండి, సివరపల్లిలోని వైబ్ 'బద్మాషులు' టీజర్లో కనిపించింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ఆర్గానిక్ అండ్ ఫన్నీగా ఉంది. ప్యూర్ కామెడీ ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com