Ramayana : రామాయణానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం . నితీష్ తివారి డైరెక్షన్, సమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం 2026లో దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తారు. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటికే గాసిప్స్ అభిమానుల ను ఆకర్షించగా తాజాగా వచ్చిన అప్డేట్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గైనారిస్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దనున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్లు రావణుడి పాత్రకు కొత్త డైమెన్షన్ను తీసుకొస్తాయని టీమ్ భావిస్తోంది. గై నారిస్ డిజైన్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు యుద్ధ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ఈ సన్నివేశా లను ముంబైలోని ఓ భారీ సెట్లో చిత్రీక రించనున్నారు. ఇందుకోసం టీమ్ ఇప్పటి కే సన్నాహాలు మొదలు పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com