Guntur Kaaram : ఆ ఆఫర్ నాకు రాలేదు .. తేల్చి చెప్పిన జబర్దస్త్ యాంకర్

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram) మిక్సుడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే సెనేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి.. సోషల్ మీడియాలో ఈ పాటకు వేలాది మంది డాన్స్ వేస్తూ రీల్స్ చేశారు. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీ లీలతో పాటుగా సీనియర్ హీరోయిన్ పూర్ణను కూడా కనిపిస్తారు. అయితే మొదట ఈ పాట కోసం జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ని సంప్రదించగా ఆమె తిరస్కరించిందంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా మరోకరైతే ఈ ఆఫర్ కు వెంటనే ఓకే చెప్తారు. కానీ రష్మీ మాత్రం నో చెప్పిందా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చ కావడంతో రష్మీ దీనిపై స్పందించింది. గుంటూరు కారం సినిమాలో ఐటం సాంగ్ ఆఫర్ తన వద్దకు రాలేదంటూ తేల్చి చెప్పింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లు మాత్రమే అంటూ కొట్టి పారేసింది.
అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుడుతాయో కూడా అర్థం కావడం లేదు అన్నట్లుగా అసహనం వ్యక్తం చేసింది. ఆ పాటలో పూర్ణ అప్పియరెన్స్ , డాన్స్ చాలా బాగుందని కూడా రష్మి తన పోస్ట్ లో పేర్కొంది. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం కు రష్మీ బ్రేక్ వేసినట్లు అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com