Chiranjeevi : మా బిడ్డ కోలుకున్నాడు - చిరంజీవి

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా చాలామంది మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లాడు. తర్వాత చిరంజీవి దంపతులు కూడా అక్కడికి వెళ్లి మార్క్ శంకర్ ను హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. అయితే మార్క్ శంకర్ ప్రమాదం బారిన పడ్డాడని తెలిసి చాలామంది పిల్లవాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు చిరంజీవి.
‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.. అయితే ఇంకా కోలుకోవాలి.
మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. ఈ హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అంటూ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com