8 Vasanthalu : మైత్రీ మూవీస్ కొత్త మూవీ 8 వసంతాలు

8 Vasanthalu : మైత్రీ మూవీస్ కొత్త మూవీ  8 వసంతాలు

ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. '365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే... ఒక వసంతం' అంటూ 8 వసంతాలు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ అని చెప్పారు.

న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించింది. ఎర్ర గులాబీతో కూడిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శకుడు ఫణింద్ర. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, తెలుగమ్మాయి చాందిని చౌదరి జంటగా ఆరేళ్ళ క్రితం వచ్చిన సినిమా 'మను'. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో ఆ చిత్రానికి ఫణింద్రనే దర్శకుడు.

గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన ‘మధురం’ షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత దర్శకుడిగా ‘మను’ అనే సినిమాని తీశాడు.

Tags

Next Story