Naga Chaitanya Wedding : నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి300 మంది గెస్టులు

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి 300 మంది అతిథుల సమక్షంలో తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. వచ్చే నెల 4న హైదరాబా ద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగబోయే ఈ కార్యక్రమానికి ఇప్పటినుంచే చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శోభిత, నాగ చైతన్యనే పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడిం చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 'ఇది మా నాన్నగారి శతజయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియో స్ నాగచైతన్య శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య తన పెళ్లిని చాలా సింపుల్గా చేయమని కోరాడు. శోభిత తల్లిదండ్రులు సంప్రదా యబద్ధంగా పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేను' అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com