Tollywood : పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా గేమ్ ఛేంజర్

గ్లోబల్ స్టార్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సాలిడ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది అదేంటంటే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా తీసుకురానున్నారట. అంతేకాదు.. ఈ వేడుకను ఏపీలోనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com