Nayanthara : నయనతారపై హైకోర్టులో పిటిషన్

Nayanthara : నయనతారపై హైకోర్టులో పిటిషన్
X

నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ పై నటుడు ధనుష్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పర్మిషన్ లేకుండా 'నానుమ్ రౌడీ దాన్ ' విజు వల్స్ను 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో వాడు కున్నారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు నయన్ దంప తులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్పై దావా వేసింది. ఇవాళ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. డాక్యుమెంట రీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తమకెంతో ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దాన్' విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా.. చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంట రీ ట్రైలర్లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ను తప్పుబట్టారు. కోలీవుడ్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమెకు పలువురు నటీమణులు మద్దతు తెలిపారు. ఈ వివాదం కాస్తా కోర్టు మెట్లెక్కడం గమనార్హం.

Tags

Next Story