Prabhas : పునీత్ ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ప్రభాస్...!

Prabhas :కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్.. ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పునీత్ ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జేమ్స్ రూపంలో ఒక మాస్టర్ పీస్ ను చూడబోతున్నాం.. పునీత్ ని అభిమానించే కోట్ల మందికి ఇది స్పెషల్ చిత్రంగా మిగిలిపోతుంది. వి మిస్ యూ పునీత్ " అని రాసుకొచ్చాడు ప్రభాస్.. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ విలన్గా నటించాడు. ఈ సినిమాలో పునీత్ పాత్రకి ఆయన అన్నయ్య శివరాజ్కుమార్ కన్నడలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాని మార్చి 17న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. కాగా పునీత్ గత ఏడాది అక్టోబరు 29న గుండెపోటుతో మరణించ సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com