Priyanka Chopra : మొన్న చిలుకూరులో.. నేడు దోమకొండలో ప్రియాంక పూజలు

Priyanka Chopra : మొన్న చిలుకూరులో.. నేడు దోమకొండలో ప్రియాంక పూజలు
X

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయంలో పూజలు చేశారు. హీరో రామ్‌చరణ్ మామ వంశస్థులకు చెందినదే ఈ దోమకొండ గడికోట. ‘జంజీర్’ మూవీ సమయంలో గడికోట గురించి ప్రియాంకకు చెర్రీ, ఉపాసన చెప్పడంతో తాజాగా ఆమె అక్కడికి వెళ్లారు. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయాన్నీ ప్రియాంక దర్శించుకున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమాలో నటించేందుకు ఆమె హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ దోమకొండ కోట కామినేని వంశీయులకు చెందినది. నిజాం నవాబులకు, అంతకు ముందు కాకతీయులకు కామినేని వంశీయులు సామంతులుగా ఉంటూ దోమకొండ సంస్థానాన్ని పాలించే వారు. కామినేని ఉమాపతి రావు మనవరాలు, కామినేని అనిల్ కూతురే ఉపాసన కామినేని. ఈమె మెగా హీరో రామ్ చరణ్ తేజ్ సతీమణి.

ఇటీవలే (జనవరి 21, 2025) ప్రియాంక చోప్రా తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్నిసందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు.

Tags

Next Story