Radhe Shyam : రాధేశ్యామ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. నవంబర్ 15(సోమవారం)న సాయింత్రం అయిదు గంటలకి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్.. 'నీ రాతలే' ను విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రానున్న ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి కలిసి ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది. కాగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
The wait is over! ☺️☺️
— UV Creations (@UV_Creations) November 13, 2021
Get ready for the #FirstRadheShyamSong to dominate your playlist! 💓 #RadheShyam
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/HMPELs2Bsz
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com