Rakul- Bhagnani Awarded : ఫిట్ ఇండియా కపుల్ గా రకుల్-భగ్నానీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాము 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు అందుకున్నట్లు ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వె ల్లడించింది. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త, నటుడునిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఢిల్లీలోని వేదికపై సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. ఈ విషయాన్ని రకులోసోషల్ మీడియా ద్వారా అభి మానులతో పంచుకుంటూ 'యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కిం చుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫిట్నెస్ సాధించడానికి ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్గా మారొచ్చు. యోగా అనేది ఎక్క డైనా, ఎప్పుడైనా సులభంగా ఆచరించవచ్చు. దీని ద్వారా శారీరక, మానసిక ఆరో గ్యాన్ని పొందవచ్చు' అని సూచించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెల బ్రిటీలతో పాటు అభిమానులు, నెటి జన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలి యజేస్తున్నారు. ఇక సినిమాల విష యానికొస్తే .. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండియన్ 3లో, హిందీలో దే దే ప్యార్ దే 2లో రకుల్ నటిస్తోంది. తెలుగులో చివరి సారిగా కొండపొలంలో హీరోయిన్ గా నటించిన ఆభామ ఆ తర్వాత డబ్బింగ్ చిత్రా లతో పలకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com