Tollywood : రామ్ పోతినేని కొత్త సినిమాను షురూ

X
By - Manikanta |21 Nov 2024 7:15 PM IST
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమాను షురూ చేశాడు. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు అందుకే యంగ్ డైరెక్టర్ మహేష్ బాబుతో జతకడుతున్నాడు. సరికొత్త కథ కథలంతో రానున్న ఈ సినిమా నేడు లాంఛనంగా మొదలయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చేఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా రామ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో అనేది చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com