Ranbir Kapoor : 'షంషేరా' ట్రైలర్ లాంచ్‌కు ముందు రణబీర్ కారుకు ప్రమాదం..

Ranbir Kapoor : షంషేరా ట్రైలర్ లాంచ్‌కు ముందు రణబీర్ కారుకు ప్రమాదం..
Ranbir Kapoor : రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం 'షంషేరా' ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. ఈవెంట్‌కు వెళుతుండగా తన కారు ప్రమాదానికి గురైందని రణబీర్ వెల్లడించాడు.

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తాజా చిత్రం 'షంషేరా' ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. ఈవెంట్‌కు వెళుతుండగా తన కారు ప్రమాదానికి గురైందని రణబీర్ వెల్లడించాడు. దీంతో ట్రైలర్ కాస్త ఆలస్యంగా మొదలైంది. తాను ఎప్పుడూ సమయపాలన పాటిస్తానని రణబీర్ పేర్కొన్నాడు.

"సమయం చాలా విలువైంది. దానిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇన్ఫినిటీ మాల్ నుండి డ్రైవర్ కారుతో నా ముందుకు వచ్చాడు. అదే పమయంలో ఎవరో నా కారును బలంగా ఢీకొన్నారు. దాంతో కారు గ్లాస్ పగిలిపోయింది, అదృష్టవశాత్తు మాకు ఏమీ కాలేదు అని రణబీర్ తన ఆలస్యానికి గల కారణం వివరించాడు.

అది విన్న షంషేరా దర్శకుడు కరణ్ ఇది శుభపరిణామం.. ఇకపై అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. షంషేరా ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను పెంచింది. ట్రైలర్‌ని బట్టి చూస్తే రణబీర్ తండ్రీకొడుకులుగా డబుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ దత్ పోషించిన పాత్ర శుద్ధ్ సింగ్. తెలివిలేని పోలీసు గ్రామస్తులను క్రూరంగా హింసిస్తున్నట్లు ట్రైలర్ చూపించింది. రణబీర్ రాబిన్ హుడ్ పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో రణబీర్ సరసన వాణి కపూర్ నటిస్తోంది.

సంజయ్‌తో కలిసి పనిచేయడం గురించి రణబీర్ మాట్లాడుతూ, "అతను నా మొదటి హీరో. నా దగ్గర అతని పోస్టర్ ఉంది. సంజూలో నేను అతనిలా నటించాను. అతడు నన్ను కొడుకులా, స్నేహితుడిలా, సోదరుడిలా చూస్తాడు. నేను ఏదైనా మంచి పని చేయకపోతే అతను నాకు ఫోన్ చేసి అరుస్తాడు. ఎక్కువ మంది ప్రేక్షకులకు గుర్తుండి పోయే చిత్రాలు చేయాలని అతడు కోరుకుంటాడు. షంషేరా చిత్రంలో ఇద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది. సంజయ్‌తో కలిసి మరిన్ని చిత్రాలు చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు రణబీర్ కపూర్.

Tags

Read MoreRead Less
Next Story