Shruti Haasan : సింగర్ గా అదరగొట్టిన శృతిశృతి

కమల్ హాసన్ తనయ శృతి హాసన్ సింగర్ గా మారిపోయారు. ఏకంగా స్టేజీ మీదే గళమెత్తారు. చూడకుండానే లిరిక్స్ పాడేశారు. మాస్ సాంగ్ పాడి అందరినీ అబ్బురపరిచారు. హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సిని మాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటె డ్. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వం లో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తు న్నారు. ఈ సినిమాలో శృతిమాసన్ 'విన్వెళి నాయగ' అనే పాట పాడిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ స్టేజి మీద శృతి లైవ్ లో అందరి ముందు ఆ పాట పాడి అదరగొట్టింది. చీరకట్టులో స్టేజీపైకి వచ్చి లిరిక్స్ చూడకుండానే.. ఏ మాత్రం తడబడకుండా పాటపా డేసింది. ఆ పాట మూవీలో కమల్ పాత్రను హైలెట్ చేసేది. ఆ మాస్ సాంగ్ ను శృతి అదరగొట్టేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com