Smriti Irani : మళ్లీ కెమెరా ముందుకు స్మృతీ ఇరానీ?

మళ్లీ కెమెరా ముందుకు స్మృతీ ఇరానీ?కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ వెబ్ సిరీస్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఏక్తా కపూర్ తీసిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ స్మృతికి పేరు తెచ్చింది. ఇప్పుడు దాన్నే సిరీస్గా రూపొందించాలని డైరెక్టర్ భావిస్తున్నారని టాక్. తులసి పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో వైరల్గా మారిన ఈ కథనాలపై ఏక్తా కపూర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు, స్మృతి ఇరానీ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు ధారావాహికల కోసం గతంలో స్మృతి ఇరానీ వర్క్ చేశారు. ఏక్తా కపూర్ రూపొందించిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే సీరియల్ ఆమెకు నటిగా ఎంతగానో గుర్తింపు తెచ్చి పెట్టింది. 2000 నుంచి 2008 వరకూ ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. 2019లో అమేథీలో రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి 2024లో కిశోరీలాల్(INC) చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com