Vijay Deverakonda : వీడీ పశ్చాత్తాపం..అది నా ఉద్దేశం కాదు

Vijay Deverakonda : వీడీ పశ్చాత్తాపం..అది నా ఉద్దేశం కాదు
X

ఇటీవల జరిగిన 'రెట్రో' ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ 'ట్రైబల్స్' అనే పదం వాడారు. అయితే గిరిజనులను అవమానించే లా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది కిషన్రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలపై విజయ్ తాజాగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. 'నేను 'రెట్రో' ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. భారత దేశంలోని ప్రజలంతా ఒక్కటేనని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం. చారిత్రక, నిఘంటు దృష్టికోణంలో నే నేను ఆ పదాన్ని ఉపయోగించాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్ ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని పాలించడం మొదలు పెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు' అంటూ వివరణ ఇచ్చాడు.

Tags

Next Story