Prakasam: ప్రకాశంలో 11 ఏళ్ల బాలుడి హత్య.. లైంగిక దాడి చేసి చంపిన ఆర్మీ ఉద్యోగి..

Prakasam: ప్రకాశంలో 11 ఏళ్ల బాలుడి హత్య.. లైంగిక దాడి చేసి చంపిన ఆర్మీ ఉద్యోగి..
Prakasam: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు.

Prakasam: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. కొమరోలు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు భూమా శ్రీనాథ్ ఈనెల 22వ తేదీన రాత్రి స్నేహితులతో ఆడుకునేందుకు బయటికి వెళ్లి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు బృందాలు బాలుడి కోసం గాలించాయి.

25న కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామం సమీపంలోని అమరావతి - కడప రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న ఓ పొలం బావిలో బాలుడు శవమై తేలినట్లు గుర్తించారు. శ్రీనాథ్‌ను కచ్చితంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. బాలుడు ఒంటిపై గాయాలు ఉండటంతో పాటు, నడుముకు తాడు కట్టి బావిలో పడేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాలతో గిద్దలూరు సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు.

అయితే.. అదే గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ విషయం బాలుడు తన తల్లిదండ్రులకు చెబుతానని ఆర్మీ ఉద్యోగితో అనడంతో.. సమాచారం బయటకు వస్తుందన్న భయంతోనే బాలుడిని ఆ ఆర్మీ ఉద్యోగి హత్య చేసి బావిలో పడేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది.

Tags

Read MoreRead Less
Next Story