Srikakulam : గ్రామ సచివాలయంలో 12ఏళ్ల బాలికపై వాలంటీర్ అత్యాచారం..!
By - TV5 Digital Team |6 Nov 2021 8:30 AM GMT
Srikakulam : ఏపీలో నాలుగు రోజుల కిందట గ్రామ సచివాలయంలో జరిగిన అత్యాచారం ఘటన కలకలం రేపింది.
Srikakulam : ఏపీలో నాలుగు రోజుల కిందట గ్రామ సచివాలయంలో జరిగిన అత్యాచారం ఘటన కలకలం రేపింది. శ్రీకుకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరులో 12 ఏళ్ల బాలికపై ఓ వాలంటీర్ అత్యాచారం చేశాడని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాల లీడర్లు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు టీడీపీ నేత జయకృష్ణ. గ్రామ సచివాలయాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను వైసీపీ రౌడీలుగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com