Nirmal: యువకుల మధ్య ఘర్షణ.. దారుణ హత్యకు దారితీసిన వివాదం..

X
By - Divya Reddy |12 May 2022 9:45 PM IST
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కత్తిపోట్లకు ఓ యువకుడు మృతిచెందాడు.
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కత్తిపోట్లకు ఓ యువకుడు మృతిచెందాడు. ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ చినికి చినికి కత్తిపోట్లకు దారితీసింది. గాజుల పేటకు చెందిన జుబేర్పై ఆగ్రహంతో ఫయాజ్ కత్తెరతో దాడికి చేశాడు. జుబేర్ గొంతుపై, కడుపులో బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఫిరోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘర్షణకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని నిర్మల్ డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com