ATM Robbery : 15 నిమిషాల్లో రూ. 20 లక్షల దొంగతనం

పక్కా ప్రొఫెషనల్ గా ఏటీఎంను చోరీ చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ లోని లింగగిరి రోడ్డులో గల ఎస్ బీఐ ఏటీఎం వద్దకు అర్ధరాత్రి ఏటీఎంలో కి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఓ దొంగ గ్యాస్ కట్టర్ తో ప్రవేశించి కట్ చేయగా.. మరో దొంగ షట్టర్ బయట ఉన్నారు. ఫార్చునర్ కారులో వచ్చిన దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారం 15 నిమిషాలలోనే ఏటీఎం ను కట్ చేసి దానిలోని మనీ బాక్సులను బయటకు తీ సుకొచ్చిన్నట్లు తెలుస్తోంది. నగదు బాక్స్ ను బయటికి తీసుకురాగానే షట్టర్ మూసివేసి ఏటీఎం రూమును తగలబెట్టి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎం నిర్వహకులు 2 రోజుల క్రితం రూ.20 లక్షలు ఏటీఎంలో పెట్టగా.. ఆ మొత్తం దొంగతనాని కి గురైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి స్థానికులు దొంగల అలజడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చరమందరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com