Andhra Pradesh : భార్య ఆత్మహత్యను తట్టుకోలేక మనస్థాపంతో భర్త సూసైడ్
By - TV5 Digital Team |29 Jan 2022 4:45 AM GMT
Andhra Pradesh : భార్య ఆత్మహత్యను తట్టుకోలేక .. తీవ్ర మనస్థాపంచెంది భర్త సూసైడ్ చేసుకున్నఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Andhra Pradesh : భార్య ఆత్మహత్యను తట్టుకోలేక .. తీవ్ర మనస్థాపంచెంది భర్త సూసైడ్ చేసుకున్నఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తణుకు పట్టణానికిచెందిన వెంకట్ అనే యువకుడు .. ఏడు ఏళ్లక్రితం లక్ష్మిదుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు సీపీఎం కార్యాలయం వీధిలో అద్దెకు ఉండేవారు. ఇంటి పక్కనవారితో వచ్చిన గొడవ కారణంగా మనస్థాపంచెందిన లక్ష్మిదుర్గ 3నెలలక్రితం ఆత్మహత్యచేసుకుంది. పక్కింటివారి సూటిపోటి మాటలవల్లే తన భార్యచనిపోయిందంటూ వెంకట్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే ఇంతవరకు పోలీసులు స్పందించకపోవడంతో వెంకట్ సెల్పీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథగా మిగిలారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com