Krishna : సంసారానికి పనికిరాని భర్తను కట్టబెట్టారంటూ.. కృష్ణా నదిలో వివాహిత దీక్ష
By - TV5 Digital Team |26 April 2022 12:00 PM GMT
Krishna : కృష్ణా నదిలో ఓ వివాహిత దీక్ష చేపట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది.
Krishna : కృష్ణా నదిలో ఓ వివాహిత దీక్ష చేపట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్త సంసారానికి పనికి రాడని తెలిసి పెళ్లి చేశారని బాధితురాలు నవ్యత ఆరోపిస్తుంది.
ఈ విషయం అత్తమామలకు చెబితే తమ పరువు పోతుందని.. బయటికి చెప్పొద్దని బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. అయితే.. విడాకులు కావాలని అడగడంతో గ్రామ పెద్దలు సమక్షంలో తనకు 15లక్షలు ఇస్తానని అత్తమామలు ఒప్పుకున్నారన్నారు.
డబ్బు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. తమపై పరువునష్టం వేశారని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ కృష్ణా నదిలో కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేపట్టింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com