Chittoor District : చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్త తల నరికిన భార్య..!

X
By - TV5 Digital Team |20 Jan 2022 4:45 PM IST
Chittoor District : చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్యే అతికిరాతకంగా నరికి చంపింది.
Chittoor District : చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్యే అతికిరాతకంగా నరికి చంపింది. హత్య అనంతరం భర్త తల తీసుకొని వెళ్లి రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఈ దారుణ హత్య పట్టణవాసులను ఉలిక్కిపడేలా చేసింది. రేణిగుంటలో నివాసముండే రవిచందర్, వసుంధర దంపతులకు తరచూ గొడవలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని రేణిగుంట పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com