Kurnool : ప్రాణం తీసిన యువతి అజాగ్రత్త.. బస్సులోంచి తల బయటపెట్టడంతో..!
![Kurnool : ప్రాణం తీసిన యువతి అజాగ్రత్త.. బస్సులోంచి తల బయటపెట్టడంతో..! Kurnool : ప్రాణం తీసిన యువతి అజాగ్రత్త.. బస్సులోంచి తల బయటపెట్టడంతో..!](https://www.tv5news.in/h-upload/2021/12/03/607030-care.webp)
By - vamshikrishna |3 Dec 2021 3:44 AM GMT
Kurnool : కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది.
Kurnool : కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న మహేశ్వరి అనే యువతి తల బయటకు పెట్టింది. ఇదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మహేశ్వరిని ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన యువతిగా గుర్తించారు. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న మహేశ్వరి శ్రీశైలంలో స్నేహితురాలి వద్దకు వచ్చి కార్తీక దీపాలు వెలిగించాలనుకుంది. కానీ అర్ధాంతరంగా దుర్మరణం చెందడం అందరిని కలిచివేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com