ఆప్ నేత గురుప్రీత్ సింగ్ పై పట్టపగలే కాల్పులు.. హత్య

ఆప్ నేత గురుప్రీత్ సింగ్ పై పట్టపగలే కాల్పులు జరపడంతో హత్యగావింపబడ్డాడు. పంజాబ్లోని తరన్ తరణ్లో ఆప్ నేతను కాల్చి చంపేశారు దుండగులు. ఈ ఘటన గోయింద్వాల్ సాహిబ్ రోడ్డులోని రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. ఆప్ నాయకుడి పేరు గురుప్రీత్ సింగ్ గోలీ చోళ అని తెలుస్తోంది.
కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు రైల్వే గేట్ వద్ద గురుప్రీత్ సింగ్పై కాల్పులు జరిపారు. ఓ కేసులో హాజరయ్యేందుకు గురుప్రీత్ తర్న్ తరణ్ నుంచి సుల్తాన్పూర్ లోధి కోర్టుకు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఎమ్మెల్యే మంజీందర్ సింగ్కు సన్నిహితుడు. ఖండూర్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్పురాకు సన్నిహితుడిగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. గత కొద్దిరోజుల్లో ఇది రెండో ఘటన. ఇటీవల హర్యానాలో ఐఎన్ఎల్డీ నేత నఫే సింగ్ రాఠీ హత్యకు గురయ్యారు.
ఫతేహాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. మీడియా నివేదికల ప్రకారం, గురుప్రీత్ సింగ్ శ్రీ గోయింద్వాల్ సాహిబ్ వైపు వెళ్తున్నాడు. ఇంతలో గేటు మూసి ఉండడంతో ఆయన కారు ఫతేహాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద ఆగింది. గేటు తెరుచుకునే వరకు అతను ఎదురు చూస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడిని బుల్లెట్లతో కాల్చారు.
దుండగులు కారులో వచ్చారు
కారులో ముష్కరులు కూడా ఉన్నారు. వెనుక నుంచి వచ్చి తీవ్రంగా దాడి చేయడం ప్రారంభించారు. గురుప్రీత్ పూర్తిగా బుల్లెట్ల బారిన పడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేసిన వారు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com