Bomb Threat : బాంబు బెదిరింపుతో ఎయిరిండియా విమానం .. ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదిరింపుతో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. థాయ్లాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎమర్జెన్సీగా అక్కడే లాండింగ్ చేశారు. 156 ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఢిల్లీకి చేరాల్సి ఉంది. బాంబు బెదిరింపుతో ప్రయాణికులను అక్కడే దింపివేసిన అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిన్న అహ్మదాబాద్ లో విమానం కూలి 250 మందికి పైగా చనిపోయిన కొన్ని గంటల్లోనే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కంగారుపడ్డ ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు,ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com