Banglore : బెంగళూరు లేడీస్ హాస్టల్ లో అరాచకం..

Banglore : బెంగళూరు లేడీస్ హాస్టల్ లో అరాచకం..

పేయింగ్ గెస్ట్ గా హాస్టల్ లో ఉంటున్నారా.. ఏదైనా హాస్టల్ లో చేరాలనుకుంటున్నారా.. ఈ వార్త మీకోసమే. పేయింగ్ గెస్ట్ గా చేరిన తర్వాత అరకొర సదుపాయాలపై ప్రశ్నించిన అమ్మాయిలను ఆ పీజీ యజమాని బెదిరించారు. ఈ ఘటన బెంగళూరులో వైరల్ అయింది. ఆ పీజీ యాజమాన్యం గూండాల్లా ప్రవర్తించింది. బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లే అవుట్‌లోని ప్రేమ అనే పీజీలో ఈ ఘటన చోటుచేసుకుందంటూ బాధిత లేడీస్ రిలీజ్ చేసిన మరో వీడియో కూడా వైరల్ అయింది.

హాస్టల్ లో పీజీగా వచ్చిన యువతులు.. గదుల్లో ఎక్కడ చూసినా దోమలు ఉన్నాయని, తినే తిండిలో పురుగులు, బొద్దింకలు ఉన్నాయని మేనేజ్ మెంట్ కు చెప్పారు. ఇది పెద్ద గొడవగా మారింది. తాగేందుకు మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆ పీజీల్లోని అమ్మాయిలు ఆరోపించారు.

పీజీ చూసుకునే వార్డెన్ కల్పనా ఆంటీ కర్రలతో అమ్మాయిలను బెదిరిస్తున్న టైంలో కొందరు అమ్మాయిలు వీడియో తీశారు. ప్రశ్నిస్తే ఇంత దారుణంగా ఎదురుదాడి చేస్తారా అంటూ ఈ వీడియో చూసినవాళ్లు షాకవుతున్నారు. హాస్టళ్లు, పీజీలు నడిపే నిర్వాహకులు ఎంతకైనా తెగిస్తారని అనుకుంటున్నారు. ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. వస్తే పరిశీలిస్తామని మహాలక్ష్మి లేఔవుట్ పోలీసులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story