Madhapur: బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు తీసుకొని..

X
By - Divya Reddy |30 May 2022 7:45 PM IST
Madhapur: హైదరాబాద్ మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది.
Madhapur: హైదరాబాద్ మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ. అందరి నుంచి సుమారుగా 20 కోట్లు మేర వసూళ్లకు పాల్పడింది. జాబ్ ట్రైనింగ్ అంటూ రెండు నెలల పాటు శిక్షణతోపాటు జీతాలు కూడా ఇచ్చింది.
రెండు వారాల క్రితం సంస్థ వెబ్సైట్, మెయిల్స్ బ్లాక్ కనిపించకపోవడంతో ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. తాము మోసపోయినట్లు తెలుసుకున్న ఉద్యోగులు..మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. సంస్థలో 800 మందిని పనిచేస్తున్నామని, కంపెనీపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా..పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత ఉద్యోగులు మాదాపూర్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com