YouTuber Arrested : పాకిస్తాన్ కు గూఢచర్యం.. మరో యూట్యూబర్ అరెస్ట్

పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు రూప్ నగర్ కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో అతడికి సంబంధాలున్న ట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో అతడికి 1.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. జాన్ మహల్ పేరుతో యూ ట్యూబ్ చానల్ నడుపుతున్న జస్బీర్సింగ్ కార్యకలాపాలపై మొహాలీలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అతడు 2020, 2021, 2024లో పాకిస్తాన్లో పర్యటించిన ట్లు, అతడి ఫోన్, ల్యాప్ టాప్ లో పాకు చెందిన నంబర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత అతడు తమ వద్ద ఉన్న సమాచారాన్ని డిలీట్ చేసినట్లు గుర్తించారు. గడిచిన మూడు వారాల్లో పాకు మన దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారం చేరవేస్తున్న 12 మందిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com