AP :రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్య జరిగింది : పల్లా శ్రీనివాస్

AP :రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్య జరిగింది : పల్లా శ్రీనివాస్
గొడ్డలిపోటును గుండె పోటుగా చిత్రీకరించిన విజయసాయిరెడ్డిని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు

రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్య జరిగిందని విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన పల్లా శ్రీనివాస్... వివేకా హత్య కేసులో దోషుల్ని కఠింగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గొడ్డలిపోటును గుండె పోటుగా చిత్రీకరించిన విజయసాయిరెడ్డిని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.

ఎన్నికల్లో వైసీపీ సానుభూతి కోసమే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. ఇక ఐ ప్యాక్ టీం, ప్రశాంత్ కిషోర్‌ని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఎపీ పోలీసులపై నమ్మకం లేదని వివేకా కూతురు సునీత కోర్టుకు వెళ్లారని.. ఈ ఘటనతో సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story