Breaking News : హైదరాబాద్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Breaking News : హైదరాబాద్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య



హైదరాబాద్ లో పట్టపగలు దారుణ హత్య జరిగింది. జియాగూడ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను చూసిన జనాలు భయంతో పరుగులు తీశారు. హత్యకు గురైన వ్యక్తితో పాటు నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతుడి ఆధార్ కార్డు ప్రకారం... కోఠీ ఇస్లామియా బజార్ కు చెందిన జంగం సాయినాథ్ (32) గా గుర్తించారు. నిందితులు సాయినాథ్ ను ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు హత్య చేసి పక్కనే ఉన్న మూసీ నదిలోకి దూకి పారిపోయినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశాడు. ఇప్పుడు అదే వీడియో పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది.



Tags

Read MoreRead Less
Next Story